News April 2, 2025
KMR: కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ యోధ మెంబర్షిప్ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన జాతీయ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నీలం రమేశ్ ఉన్నారు.
Similar News
News January 10, 2026
ప్రభుత్వ అనుమతితో సింగూరు నీటి విడుదల

సింగూరు ప్రాజెక్టులో మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్లకు(8.1TMC) తగ్గిస్తే ఈ సీజనులో కట్ట బలోపేత పనులకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రభుత్వంతో ఈనెల 11 లేదా 12 నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. HYDతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిమట్టాన్ని 8.1 TMCలకే పరిమితం చేయనున్నారు.
News January 10, 2026
మెడ నలుపు తగ్గాలంటే?

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 10, 2026
జిల్లాల కుదింపు.. నల్గొండ రెండు జిల్లాలేనా..?

రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. చాలా జిల్లాల్లో గందరగోళం ఉండటంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలుగా సర్కార్ కుదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్ను ఒక్క జిల్లాకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సర్కార్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జిల్లాలు (NLG, యాదాద్రి, SRPT)గా విభజన చేశారు.


