News March 19, 2025
KMR: గుడిలో దొంగతనం చేసి చనిపోయాడు

ఆలయంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తునూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఉత్తునూర్లో మంగళవారం రాత్రి హనుమాన్ ఆలయంలో శ్రీకాంత్(25) దొంగతనానికి యత్నించాడు. గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. తీవ్ర గాయాలైన శ్రీకాంత్ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Similar News
News April 20, 2025
అనకాపల్లి: భర్తపై వేడినీరు పోసిన భార్య

అనకాపల్లి మండలం తుంపాలలో భర్తపై భార్య వేడి నీరు పోసి గాయపరిచింది. భర్త చంద్రశేఖర్ను ఇల్లరికం రావాలని భార్య లోకేశ్వరి ఒత్తిడి తీసుకువస్తుంది. భర్త నిరాకరించడంతో లోకేశ్వరి వేడి నీరు పోసినట్లు సీఐ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. గాయపడిన భర్త అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
News April 20, 2025
రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

TG: హైడ్రాకు ఓ బాలుడు రాసిన లేఖ రూ.3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. లంగర్హౌజ్కు చెందిన బాలుడు జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర్లోని ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంతో అతడు హైడ్రాకు లేఖ రాశాడు. అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన హైడ్రా, అక్కడి 39 ఎకరాల భూమిని తాజాగా స్వాధీనం చేసుకుంది.
News April 20, 2025
KMR: స్విమ్మింగ్ పూల్లో పడి యువకుడి మృతి

బిక్కనూర్లోని పెద్దమల్లారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెగుంటకు చెందిన సందీప్ పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం దామరచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం స్నేహితులతో కలిసి పెద్దమల్లారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి వెళ్లాడు. సందీప్ పూల్లోకి దూకగానే తలకు గాయమై ఫిట్స్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.