News January 25, 2025

KMR: గ్రామ, వార్డు సభలు పూర్తి..అర్జీలు ఎన్నంటే?

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించగా.. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News November 21, 2025

బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

image

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <>పోస్టులు<<>> పెట్టారు. ఫైనల్ SIR ఫిగర్‌ను ప్రకటించిన తర్వాత కూడా మొత్తం ఓటర్ల సంఖ్యను EC 2సార్లు మార్చిందని, ఓటింగ్ శాతంపై విడుదల చేసిన ప్రకటనల్లోనూ తేడాలున్నాయన్నారు. దీనిపై ECI వివరణ ఇవ్వాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News November 21, 2025

జర్నలిస్ట్‌లు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

image

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.

News November 21, 2025

NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

image

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఈ టోర్నీలు జరగ లేదు.