News January 25, 2025
KMR: గ్రామ, వార్డు సభలు పూర్తి..అర్జీలు ఎన్నంటే?

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించగా.. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News October 16, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 7 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iict.res.in/
News October 16, 2025
కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.
News October 16, 2025
మహిళలు రోజూ గుమ్మడి గింజలు తింటే?

గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మహిళలు రోజూ 10 గుమ్మడి గింజలను తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గర్భధారణ సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. PCOS, థైరాయిడ్, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి.
#ShareIt