News January 25, 2025

KMR: గ్రామ, వార్డు సభలు పూర్తి..అర్జీలు ఎన్నంటే?

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించగా.. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News December 1, 2025

కృష్ణా: నవోదయలో 21 మంది విద్యార్థులు సస్పెండ్.. కారణమిదే.!

image

వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్‌లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్-నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.

News December 1, 2025

నల్గొండ: గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు

image

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్‌ను పరిచయం చేస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంతో కలిసి వారు ఆవిష్కరించారు.

News December 1, 2025

అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

image

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.