News January 25, 2025
KMR: గ్రామ, వార్డు సభలు పూర్తి..అర్జీలు ఎన్నంటే?

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించగా.. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
పార్వతీపురంలో యాక్సిడెంట్.. టీచర్ మృతి

పార్వతీపురం-నర్సిపురం మధ్యలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తోన్న మరిశర్ల వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
గద్వాల్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

గద్వాల్ జిల్లా ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఏవైనా సమస్యలు సూచనలు ఉన్న ప్రయాణికులకు బుధవారం డీఎం సునీత నేరుగా అందుబాటులో ఉండనున్నారు. రేపు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రయాణికులు 9959226290 నంబర్ కాల్ చేయాలన్నారు.
News November 18, 2025
ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?


