News January 20, 2025

KMR: గ్రామ సభల్లో వైద్య సిబ్బంది పాల్గొనాలి: జిల్లా వైద్యాధికారి

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో సంబంధిత గ్రామ, మండల ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొనాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఆదేశించారు. ఆశా, ANM, సూపర్వైజరీ, MLHP ప్రతి గ్రామ సభల్లో తప్పకుండా ఉండాలన్నారు. గ్రామ సభల్లో సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో ఎరువుల యాజమాన్యం ఇలా..

image

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

News September 14, 2025

HZB: సైబర్ నేరగాళ్లను తెలివిగా బోల్తా కొట్టించిన తల్లి

image

సైబర్ నేరగాళ్ల నుంచి KNR(D) HZB‌కు చెందిన సుస్రత్ అనే మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె కూతురు పోలీసుల కస్టడీలో ఉందని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. కేసు పరిష్కారం కోసం వెంటనే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో భయపడినప్పటికీ, ఆమె వెంటనే తేరుకుని తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె కూతురు క్షేమంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 14, 2025

ప్రకాశం లోక్ అదాలత్‌లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

image

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.