News April 11, 2025
KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.
Similar News
News December 19, 2025
ధనుర్మాసం: నాల్గోరోజు కీర్తన

‘ఓ మేఘుడా! లోభం చూపకుండా సముద్రపు నీటిని నిండుగా తాగి, నారాయణుని నల్లని మేని రంగును ధరించి ఆకాశానికి ఎగయుము. స్వామి సుదర్శన చక్రంలా మెరిసి, పాంచజన్య శంఖంలా గంభీరంగా గర్జించు. శారంగ ధనుస్సు నుంచి వచ్చే బాణాల వలె అమృతధారలను కురిపించు. లోకమంతా సుఖంగా ఉండాలని, మా వ్రతం నిర్విఘ్నంగా సాగాలని వెంటనే వర్షించు’ అని సమస్త జీవరాశికి మేలు కోసం అండాల్ దేవి పర్జన్యుని వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>
News December 19, 2025
రేపే T20 WC జట్టు ప్రకటన!

భారత T20 WC జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా సూర్య, వైస్ కెప్టెన్గా గిల్ను కొనసాగించనున్నారు. SA సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి. 2026 FEB 7- MAR 8 వరకు T20 WC జరగనుంది.
News December 19, 2025
ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 21న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


