News April 11, 2025

KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్‌కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.

Similar News

News October 30, 2025

అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష..

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ MLA తోటలక్ష్మీ కాంతారావు సమక్షంలో గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ, విద్యా, వైద్యం, DRDO, R&B వంటి వివిధ శాఖల ప్రగతిపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు ఎమ్మెల్యే తెలిపారు.

News October 30, 2025

భద్రాద్రి: ఆదివాసీల ఆరోగ్య రహస్యం.. ‘కొండ జొన్న’

image

తెలంగాణ సరిహద్దు మన్యం గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువగా కొండ జొన్నను సాగు చేస్తున్నారు. ఎటువంటి ఎరువులు వాడకుండా పండించే ఈ జొన్నను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక విటమిన్లు అంది, ఆరోగ్యంగా ఉంటారని ఆదివాసీలు, గిరిజనులు చెబుతున్నారు. కొండజొన్నతో తయారుచేసిన ఆహారాన్ని తినడం ద్వారా షుగర్ వంటి వ్యాధులను కూడా నియంత్రించవచ్చని, ముఖ్యంగా వేసవిలో జొన్న అంబలి తాగి కడుపు నింపుకుంటామని చెబుతున్నారు.

News October 30, 2025

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.