News March 28, 2025
KMR: చెట్టుకు కట్టేసి కొట్టారు (UPDATE)

దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. రమేశ్ అనే వ్యక్తిని పలువురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రమేశ్ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఓ కారు అమ్మకం విషయంలో గొడవ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Similar News
News November 21, 2025
ప్రతీసారి మేడారం జాతరకు ముందే బదిలీలు..!

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణం అయినప్పటికీ ములుగు జిల్లా విషయంలో మాత్రం ప్రాధాన్యత అంశంగా మారుతోంది. మేడారం మహా జాతరకు ముందే ఉన్నతాధికారులు బదిలీ కావడం చర్చకు దారితీస్తోంది. 2024 జాతరకు నెల ముందు అప్పటి ఎస్పీ సంగ్రామ్ సింగ్ బదిలీ అయ్యారు. ఇప్పుడు జాతరకు రెండు నెలలు ఉందనగా శబరీశ్ బదిలీ అయ్యారు.
News November 21, 2025
పెద్దపల్లి: వ్యవసాయ భూమిగా చూపి.. రూ.5.30 లక్షల రైతు భరోసా స్వాహా

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సర్వే నం.584 వ్యవసాయ భూమిపై విద్యాసంస్థ భవనాలు ఉన్నప్పటికీ, ఆ భూమిని వ్యవసాయంగా చూపించి రూ.5.30 లక్షల రైతు భరోసా నిధులను అక్రమంగా పొందారని రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాసరి పుష్పలత పేరుతో ఉన్న ఈ పట్టాదార్ పాస్బుక్పై విచారణ చేసి, అక్రమ లబ్ధిని రికవరీ చేయాలని ఆయన కోరారు.
News November 21, 2025
ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ములుగు ఓఎస్డీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్ఛార్జిగా డీఎస్పీ రవీందర్ వ్యవహరిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న అధికారులను నియమించాలని ఉద్దేశంతో శివం ఉపాధ్యాయకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్ను నియమించారు.


