News March 28, 2025

KMR: చెట్టుకు కట్టేసి కొట్టారు (UPDATE)

image

దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. రమేశ్ అనే వ్యక్తిని పలువురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రమేశ్‌ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఓ కారు అమ్మకం విషయంలో గొడవ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Similar News

News October 22, 2025

జాతీయ రహదారి సత్వరంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారికి 167ఎ నిర్మాణం సత్వరానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 92.38% పూర్తి కాగా మొత్తం 2.6 హెక్టార్ల 3డి పనులు వారం రోజులలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సూర్యలంక బీచ్-2.0 నిధుల్లో పురోగతి వేగవంతం, ఆక్వా పార్క్ 192.42 ఎకరాల్లో నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

News October 22, 2025

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత..!

image

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి రెండు రోజులు పాటు పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 22, 2025

జగిత్యాల: ‘జీపీఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి’

image

భూ భారతి చట్టంపై జీపీవోలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో నూతన జీపీవోలకు విధులు, బాధ్యతలు, భూ భారతి చట్టంపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఓఆర్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సాదా బైనామల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర వాటిపై జీపీఓలకు అవగాహన కల్పించారు. విలేజ్ మ్యాప్ విధి నిర్వహణలో వెంట ఉండాలన్నారు.