News March 25, 2025
KMR: జర్నలిస్ట్ల అక్రడిటేషన్ కార్డుల గడువు పెంపు

రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని 3 నెలల పాటు పొడిగించినట్లు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ&పీఆర్ విభాగం వర్కింగ్ జర్నలిస్టులను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసౌకర్యాన్ని చెల్లుబాటును మూడు నెలల పాటు పొడిగించారన్నారు.
Similar News
News November 3, 2025
గాంధారిలో 51మి.మీ. అత్యధిక వర్షపాతం

కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షం కారణంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారి 51 మి.మీ., బొమ్మన్ దేవిపల్లిలో 33, కొల్లూరు 28.5, బీబీపేట్ 21.5, నస్రుల్లాబాద్ 20.3, సదాశివనగర్ 16, సర్వాపూర్ 13.8, IDOC(కామారెడ్డి) 13, బీర్కూర్ 9.2, మక్దూంపూర్ 7, రామలక్ష్మణ పల్లి 5.8, ఆర్గొండ 5.2, మాచాపూర్ 4, హసన్పల్లి 3.8మి.మీ. నమోదయ్యింది.
News November 3, 2025
ఎటు చూసినా మృతదేహాలే..

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.
News November 3, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,920 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం రూ.7 వేలకు పైగా పలికిన పత్తి ధర.. నేడు పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.


