News March 25, 2025

KMR: జర్నలిస్ట్‌ల అక్రడిటేషన్ కార్డుల గడువు పెంపు

image

రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని 3 నెలల పాటు పొడిగించినట్లు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ&పీఆర్ విభాగం వర్కింగ్ జర్నలిస్టులను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసౌకర్యాన్ని చెల్లుబాటును మూడు నెలల పాటు పొడిగించారన్నారు.

Similar News

News April 2, 2025

రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

image

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.

News April 2, 2025

తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.

News April 2, 2025

IPL: హ్యాట్రిక్‌పై కన్నేసిన RCB

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.

error: Content is protected !!