News February 12, 2026

KMR: జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు సిద్ధం: SP

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా జిల్లా వ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Similar News

News March 12, 2026

యుద్ధం ఎఫెక్ట్.. వరంగల్ జిల్లాలో పెరిగిన వంట నూనె ధరలు!

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో ఈ ధరలు లీటరుకు రూ.15-25 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. గతంలో సన్‌ఫ్లవర్ రూ.145-155 ఉండగా ఇప్పుడు రూ.180కి పెరిగింది. పామాయిల్ రూ.100-110 ఉండగా, ఇప్పుడు రూ.160 వరకు పెరిగాయి. వేరుశనగ నూనె రూ.180కి పెరిగింది. హోల్ సెల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్లే వంట నూనె ధరలు పెరుగుతున్నట్లు రిటైల్ వ్యాపారులు తెలిపారు.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

News March 12, 2026

జీకేవీధి: ఊబ పొలం..ఊటనిరే ఆధారం

image

అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గుక్కెడు మంచినీటికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఆయా గ్రామాల గిరిజనులది. అలా అల్లూరి జిల్లా రింతాడ పంచాయతీ ఊబపొలం గ్రామంలో మంచినీటి మంచినీళ్లు దొరక్క పొలాల గట్ల వద్ద ఊరే ఊట నీటినే ఆధారంగా జీవిస్తున్నారు. వర్షం వస్తే ఆ ఊట నీరు బురదగా మారుతున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు