News January 19, 2025

KMR: జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

image

కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు జిల్లాలో ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 12.2, మేనూర్ 12.7, గాంధారి 13.2, డోంగ్లి 13.5, బిచ్కుంద, పుల్కల్ లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 23, 2025

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్: కలెక్టర్

image

విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌ను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. అంతరిక్ష రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.

News November 23, 2025

పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారు: MP కావ్య

image

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి ఇంటికి వెలుగు చేరేలా, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.

News November 23, 2025

గిరిజన దర్బారుకు సకాలంలో హాజరు కావాలి: పీవో రాహుల్

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని కోరారు.