News February 3, 2025

KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు

image

కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 13, 2025

GNT: జాతీయ లోక్ అదాలత్‌లో 23,466 కేసుల పరిష్కారం

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఒకేరోజు 23,466 కేసులు పరిష్కారం అయ్యాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో 17 బెంచీలతో కలిపి, జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో 1,376 సివిల్, 21,415 క్రిమినల్, 578 చెక్ బౌన్స్, 97 ప్రీలిటికేషన్ కేసులలో రూ.57,68,57,572 ఇప్పించారు.

News December 13, 2025

గోవా క్యాంపునకు నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు..?

image

కొంచెం.. కొంచెంగా నెల్లూరు వైసీపీ కార్పొరేటర్ల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 41 స్థానాలు కైవసం చేసుకున్న TDP మిగిలినవారిని లాగేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. వైసీపీ పరువు కాపాడుకొనే ప్రయత్నంలో పడిపోయింది. ఉన్న 11 స్థానాలను అయినా కాపాడుకునేందుకు గోవా క్యాంపునకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News December 13, 2025

పడమర దిక్కులో బోరు బావి ఉండవచ్చా?

image

సాధారణంగా ఇంటికి అవసరమయ్యే నీటి వనరులు ఈశాన్యం/ ఉత్తర దిక్కులలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయినప్పటికీ పడమర దిక్కులో బోరు వేయడం వలన నీటి అవసరం తీరుతుంది కాబట్టి ఇది వాస్తు పరంగా ఆమోదయోగ్యమే అని అంటున్నారు. ‘నీరు అనేది ప్రాథమిక అవసరం కాబట్టి, దానిని మంచి స్థలంలో నిల్వ చేసుకున్నా, నిత్యం అందుబాటులోకి తెచ్చినా తప్పేం ఉండదు. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>