News April 5, 2025

KMR: జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు

image

యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 33 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమై 686 టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 13, 2025

చిత్తూరు: మొదటిసారి నిర్ణయం.. 9 మంది మృతి

image

అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం 9మంది ఆయువు తీసింది. చిత్తూరు <<18539726>>బస్సు ప్రమాద<<>> ఘటనలో.. ట్రావెల్స్ యజమాని 1993 నుంచి ఈ రంగంలో ఉన్నారు. పన్నీరుసెల్వం వజ్రమణి(ఏజెంట్) ద్వారా యాత్రలు చేపడుతుంటాడు. 22 ఏళ్లలో ఎప్పుడూ వజ్రమణి రాత్రి ప్రయాణం చేయలేదట. టూర్ ఆలస్యం కావడంతో మొదటిసారి రాత్రి ప్రయాణం చేశారంట. భద్రాచలం యాత్ర సైతం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమంట. పొగమంచు, అతివేగం సైతం 8 కుటుంబాల్లో విషాదం నింపింది

News December 13, 2025

భారత్‌పై టారిఫ్‌లు.. ట్రంప్‌పై వ్యతిరేకత

image

భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన US అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, INDతో సంబంధాలకు నష్టమని విమర్శించారు. <<18529624>>పుతిన్-మోదీ<<>> భేటీపైనా USలో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.

News December 13, 2025

ఖమ్మం: భార్యాభర్తలే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌

image

బోనకల్‌ పంచాయతీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి మంగమ్మపై 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి రిజర్వేషన్‌‌ జనరల్‌ మహిళా కావడంతో సతీమణిని బరిలో నిలిపి, సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సీపీఎం తరఫున జడ్పీటీసీగా గెలిచారు.