News April 5, 2025
KMR: జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు

యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 33 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమై 686 టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 16, 2025
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

‘బలగం’తో డైరెక్టర్గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
News October 16, 2025
సిద్దిపేట: ఓటర్ ఐడీలను పంపిణీ చేయాలి: కలెక్టర్

ఓటర్ ఐడీలను పంపిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫామ్ 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, బీఎల్ఓలకు గుర్తింపు కార్డుల పంపిణీ, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డ్ పంపిణీ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై నాగర్కర్నూల్ కలెక్టర్ సమీక్ష

అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఈరోజు నాగర్కర్నూల్లోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులకు మెప్మా ద్వారా బ్యాంకు రుణాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.