News April 3, 2025
KMR: జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం

కామారెడ్డి జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇసుక తవ్వకాలు, రవాణా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూస్తాం అని అన్నారు.
Similar News
News November 19, 2025
అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 19, 2025
కుక్క కాట్లు బాబోయ్.. ఘననీయంగా పెరిగిన సంఖ్య.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుక్క కాటు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇ సంఖ్య అధికంగా ఉంది. NTR (D)లో గతేడాది 15వేల కుక్క కాటు బాధితులు ఉండగా, ఈఏడాది NOV 17నాటికే 16,893 కేసులు నమోదయ్యాయి. కుక్క కాటుపై అవగాహన పెరగడంతో చిన్న గాయమైనా వెంటనే ఆసుపత్రికి వచ్చి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. NTRలో ప్రస్తుతం 11వేల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
News November 19, 2025
జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.


