News April 15, 2025

KMR: టీటీడీ ఛైర్మన్‌కు VHP ఆధ్వర్యంలో వినతి

image

కామారెడ్డి జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సిద్దిరామేశ్వర,కాలభైరవ,లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల అభివృద్ధిని కోరుతూ మంగళవారం తిరుమలతిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.TTD ఛైర్మన్ స్పందిస్తూ దేవాలయాల అభివృద్ధికి అంచనావేసి పరిశీలిస్తామన్నారు. కలిసిన వారిలో కామారెడ్డి VHP నగరాధ్యక్షుడు వెంకటస్వామి,BJP రాష్ట్రనాయకుడు రణజిత్ మోహన్ ఉన్నారు.

Similar News

News November 22, 2025

యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

image

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.

News November 22, 2025

హుజురాబాద్‌‌లో దూరవిద్య తరగతులు ప్రారంభం

image

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.

News November 22, 2025

కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

image

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.