News February 4, 2025
KMR: ట్రాక్టర్ బోల్తా ఆరుగురికి గాయాలు

బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో మంగళవారం కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం కట్టెలు తీసుకొని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 25, 2025
విశాఖ: డెలివరీ బ్యాగ్లో గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

డెలివరీ బ్యాగులను అడ్డుగా పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్మాది ప్రాంతంలో నిర్వహించిన దాడిలో నల్లబిల్లి గణేశ్ (32), సంజయ్కుమార్ (29)ని పట్టుకున్నారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ప్రజలను కోరారు.
News October 25, 2025
ALP: విశేష దినాల్లో కార్తీక దీపోత్సవం..!

కార్తీక మాసం పురస్కరించుకొని అలంపూర్ ఆలయాల్లో ప్రతి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య విశేష దినాల్లో సాయంత్రం 6 :00 సామూహిక కార్తీకదీపం నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరపున ఉచితంగా ప్రమిదలు, వత్తులు, నూనె ఇస్తామన్నారు. దీపోత్సవం అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, తమలపాకులు, నిమ్మకాయలు ప్రసాదంగా ఇస్తామని తెలిపారు.
News October 25, 2025
WWC: భారత్ సెమీస్లో తలపడేది ఈ జట్టుతోనే

AUSతో మ్యాచ్లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్లో గెలిచినా నాలుగో ప్లేస్లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్లో SA, ENG తలపడతాయి.


