News January 24, 2025

KMR: డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభల్లో విచారణ చేపట్టిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. శుక్రవారంతో సభలు ముగియనుండడంతో డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా సభలు నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

Similar News

News December 7, 2025

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

image

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

News December 7, 2025

నేడు కడప జిల్లాకు తెలంగాణ డిప్యూటీ CM.!

image

తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్కతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పోట్లదుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు ఇటీవలే మాతృవియోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి వారు పొట్లదుర్తి చెరుకుని అనంతరం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.

News December 7, 2025

NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

image

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్‌ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్‌గానూ పనిచేశారు.