News January 24, 2025
KMR: డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభల్లో విచారణ చేపట్టిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి డేటాను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. శుక్రవారంతో సభలు ముగియనుండడంతో డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా సభలు నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
Similar News
News February 9, 2025
ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
News February 9, 2025
కిరణ్ రాయల్ వివాదానికి ఆ ఫొటోనే కారణమా?

తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వివాదానికి రెండు రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్లో జగన్ 2.0 పోస్టర్ను రిలీజ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఫొటోతో మాజీ ముఖ్యమంత్రి హేళన చేయడం సహించలేని వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ ఫోన్ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన డేటాను అటు మీడియాకు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
News February 9, 2025
కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.