News December 7, 2024
KMR: ‘తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి’
ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చివరి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులలో వారం సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 21, 2025
NZB: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. జండాగల్లికి చెందిన నర్సయ్య (43) భార్య, అత్తామామ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం రైలు కిందపడి పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు సమాచారం అందించడంతో స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
News January 21, 2025
గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: NZB కలెక్టర్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News January 21, 2025
NZB: గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద దారుణంగా హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సౌత్ రూరల్ సీఐ, ఎస్సై ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.