News April 10, 2025

KMR: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు 

image

తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు కామారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. SP రాజేష్ చంద్ర వివరాలిలా.. పిట్లం వాసి శాదుల్ అతని తమ్ముడైనా ముజీబ్‌ను ఆస్తి తగాదాల విషయంలో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై పిట్లం PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడికి జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు.

Similar News

News November 20, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వివరాలు

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ.3,976, గరిష్ఠ ధర రూ.7,330 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,700, గరిష్ఠ ధర రూ.6,636 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,109, గరిష్ఠంగా రూ.5,924 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 20, 2025

కడప జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

కడప జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 20, 2025

చింతూరు: తవుడు బస్తాల మాటున గంజాయి రవాణా

image

చింతూరు మండలం ఎర్రంపేట సమీపంలో బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బొలెరో వాహనంలో క్రింద గంజాయి, పైన తవుడు బస్తాలు వేసి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన గంజాయి 120కిలోలు రూ.6లక్షలు ఉంటుందన్నారు. ఒరిస్సా మల్కాన్‌గిరికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.