News April 10, 2025

KMR: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు 

image

తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు కామారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. SP రాజేష్ చంద్ర వివరాలిలా.. పిట్లం వాసి శాదుల్ అతని తమ్ముడైనా ముజీబ్‌ను ఆస్తి తగాదాల విషయంలో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై పిట్లం PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడికి జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు.

Similar News

News November 25, 2025

వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

image

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్‌కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.

News November 25, 2025

నర్సంపేటలో విషాదం.. పుట్టినరోజునే మృత్యుఒడికి!

image

నర్సంపేట పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రత్యూష ఇంటి ప్రాంగణంలో ఆరుబయట ఆరవేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు 8 నెలల గర్భిణి కాగా.. ఇవాళ ఆమె పుట్టినరోజు అని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.

News November 25, 2025

ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

image

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.