News March 20, 2025
KMR: తాగునీటి సమస్య నివారణపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణా రెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్షలో 48 గ్రామాలకు రూ.53.36 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో 5 కొత్త ట్యాంకర్లు కొనుగోలు, అవసరమైతే మరో 4 ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

AP: తుఫాన్ కారణంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.
News November 28, 2025
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
News November 28, 2025
SVU: పీజీలో సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో పీజీ (PG) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకు PGCET పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో నేరుగా వర్సిటీలో హాజరుకావాలని ఆయన సూచించారు.


