News March 29, 2025
KMR: తెలంగాణ ఉద్యమం చేసిందే అందుకే: MLC కవిత

బడుగు బలహీన, బహుజనులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం చేసి TGను సాధించుకున్నామని MLC కవిత అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. కవిత మాట్లాడుతూ.. కులసంఘలా ఒత్తిడితోనే ప్రభుత్వం తలొగ్గి రెండు బిల్లులు అసెంబ్లీలో పెట్టారన్నారు. ప్రభుత్వం చేసిన జనాభా లెక్కలను జీపీలా వారీగా అతికించాలని ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్సైట్: https://www.manit.ac.in
News November 17, 2025
అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.
News November 17, 2025
అక్కడ అలా.. ఇక్కడ ‘డీలా’..!

మన్యం జిల్లాలో మారుమూల అందాలను వెలికితీస్తున్న అధికారులు.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తోటపల్లి బోటుషికారుపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ నుంచి మూడు బోట్లను తాటిపూడి తరలించడం గమనార్హం. తాటిపూడిలో బోటు షికారు జోరుగా సాగుతుంటే.. ఇక్కడ డీలా పడింది. తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బోటు షికారు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


