News January 24, 2025

KMR: దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల గురువారం తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 % రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News December 4, 2025

KNR: అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు.. జోరుగా ప్రచారం

image

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇప్పటివరకు గుర్తులు లేకుండా ఓట్లు అడిగిన అభ్యర్థులు, ఇప్పుడు తమ గుర్తులతో ప్రచారంలోకి దిగి వేగం పెంచారు. ఇలా గుర్తులు కేటాయించారో లేరో అలా సోషల్ మీడియాలో తమతమ గుర్తులతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

News December 4, 2025

HNK: కోతులు, కుక్కల బెడదపై ప్రత్యేక ఫోకస్..

image

హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదను అరికడితేనే మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్తూ ఉండడంతో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నేరెళ్ల గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణలతో విన్నూత్న ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

image

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.