News April 4, 2025
KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 15, 2025
మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.
News December 15, 2025
తిరుపతి జిల్లాకు రాష్ట్రపతి, గవర్నర్ రాక

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో రేణిగుంట విమానాశ్రయంలో సమావేశమయ్యారు. భద్రతకు సంబంధించిన అంశాలపై, ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులు పాల్గొన్నారు.
News December 15, 2025
క్వాయర్ యూనిట్ల అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

క్వాయర్ మ్యాట్ యూనిట్లను చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంట్రికోన పర్యటనలో సర్పంచ్ శ్రీనివాస్ ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారు. దీనివల్ల యూనిట్లపై ఆధారపడిన మహిళలకు ప్రభుత్వ రాయితీలు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో దీనిపై విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.


