News April 4, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 19, 2025

ADB: ఐటీఐ ముడిసరకు కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌, ఉట్నూరు ప్రభుత్వ ఐటీఐ సంస్థలకు అవసరమైన వివిధ వృత్తుల ముడిసరకు సరఫరాకు సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జీఎస్‌టీ గుర్తింపు పొందిన సరఫరాదారులు 5 రోజుల్లోగా ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని బాక్సులో కొటేషన్లు అందజేయాలన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం 9866435005 నంబరును సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన సరకు సరఫరా చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

News December 19, 2025

పల్నాడు: సచివాలయాల్లో ముఖ ఆధారిత హాజరు

image

సచివాలయాల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాలోని సచివాలయ ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, పక్కాగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయానికి కార్యాలయానికి వస్తున్నారా.? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.? లేదా.? అన్న అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.

News December 19, 2025

మంత్రి ‘కొల్లు’తో బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బృందం భేటీ

image

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్రను కలిసింది. రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నివారణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో బీచ్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులు పెడతామన్నారు.