News October 30, 2024

KMR: నవంబర్ 28లోగా అభ్యంతరాలు, ఆక్షేపణలు తెలపండి: ఆశిష్ సాంగ్వాన్

image

స్పెషల్ సమ్మరీ రివిజన్- 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే నవంబరు 28 లోగా సమర్పించవచ్చన్నారు. నవంబరు 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 24న పరిష్కరించడం పూర్తవుతుందన్నారు. జనవరి 26న ఫైనల్ పబ్లికేషన్ ప్రకటిస్తామని తెలిపారు.

Similar News

News November 29, 2025

NZB: మొదటి విడత నామినేషన్లకు నేడే ముగింపు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోరులో నామినేషన్ల స్వీకరణకు శనివారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. జిల్లాలో మొదటి విడతలో బోధన్ డివిజన్‌లోని 184 జీపీలు, 1,642 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 304, వార్డు స్థానాలకు 382 నామినేషన్లు వచ్చాయి. నేడు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్న క్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

News November 29, 2025

నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.

News November 29, 2025

నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.