News January 18, 2025

KMR: నవోదయ ప్రవేశ పరీక్షకు 2076 మంది గైర్హాజరు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష పూర్తైనట్లు నిజాంసాగర్ నవోదయ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మను యోహనన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో14, కామారెడ్డి జిల్లాలో 14 కేంద్రాల్లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం 6,040 మంది దరఖాస్తు చేసుకోగా 3,964 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 2076 మంది గైర్హాజరైనట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ వెల్లడించారు.

Similar News

News November 28, 2025

ఖమ్మం: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18కి వాయిదా

image

ఖమ్మం నగరంలోని ప్రసాద్ భవన్‌లో శుక్రవారం సీపీఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరగాల్సిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జనవరి 18కి వాయిదా వేసినట్లు వారు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనవరి 18న జరిగే జయంతి ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

News November 28, 2025

2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

image

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.

News November 28, 2025

ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.