News April 16, 2025

KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News November 7, 2025

పరవాడ: మాక్ అసెంబ్లీకి ఎంపికైన పరవాడ విద్యార్థిని

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హరిత ఎంపికైంది. అనకాపల్లిలో నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన హరిత మాక్ అసెంబ్లీకి ఎంపికైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మద్దిలి వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. హరితకు కళాశాల అధ్యాపకులు అభినందించారు.

News November 7, 2025

తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

image

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News November 7, 2025

‘అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోవాలి’

image

అనుమతులు లేని ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆద్వర్యంలో కలెక్టర్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీలు చలామణి అవుతున్న వైద్యులు తమ స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు అధిక మొత్తంలో ఇంజెక్షన్ లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితం కావాలని వారు కోరారు.