News March 15, 2025
KMR: నేటి నుంచి ఒంటి పూట బడులు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్షలైన అనంతరం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూలు ఉంటుంది. వేసవి సందర్భంగా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించనున్నారు.
Similar News
News November 8, 2025
ADB: గోదావరిలో యువకుడి గల్లంతు

గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జన్నారం మండల కేంద్రానికి చెందిన శ్రావణ్ నానమ్మకు శుక్రవారం సంవత్సరికం చేశారు. శనివారం ఉదయం బాదంపల్లి శివారులోని గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లాడు. గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లే క్రమంలో గల్లంతయ్యాడు.
News November 8, 2025
గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.
News November 8, 2025
కుప్పంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు.. 22 వేల మందికి ఉపాధి

☞ <<18231350>>ఆదిత్య బిర్లా<<>>- రూ.586 కోట్లు(Cr) పెట్టుబడి- 920 మందికి ఉపాధి
☞ ACE పరిశ్రమ- రూ.525 Cr పెట్టుబడి – 7 వేల మందికి ఉపాధి
☞ SVF సోయా- రూ.372.8 Cr పెట్టుబడి- 2500 మందికి ఉపాధి
☞ మదర్ డెయిరీ- రూ.260 Cr పెట్టుబడి- 4000 మందికి ఉపాధి
☞ శ్రీజ కంపెనీ- రూ.233Cr పెట్టుబడి- 4 వేల మందికి ఉపాధి
☞ ఈ-రాయిస్- రూ.200Cr పెట్టుబడి- 410 మంది ఉపాధి
☞ ALEAP పరిశ్రమ-రూ.26.7Cr పెట్టుబడి- 3500 మందికి ఉపాధి.


