News January 21, 2025
KMR: నేటి నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కామారెడ్డి, దోమకొండ, పల్వంచ, బిక్కనూర్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, బిబిపేట్ ప్రాంతాల వారికి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్లోని KVS గార్డెన్లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 14, 2025
తిరుపతి: లోకేశ్ను కలిసిన రాకేశ్ కుటుంబ సభ్యులు

ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో రాకేశ్ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
News February 14, 2025
Good News: హోల్సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.
News February 14, 2025
అకౌంట్లోకి రూ.15,000.. రేపే లాస్ట్

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్పై ఆసక్తి చూపడం లేదు.