News March 10, 2025

KMR: నేడు ప్రజావాణి: జిల్లా కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నేడు (సోమవారం) కలెక్టర్ సమావేశం మందిరం వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆశిష్ సాంగ్వాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 14, 2026

సిద్దిపేట: ‘సమాజ దిశ మార్చేది కవిత్వమే’

image

సమాజంలోని రుగ్మతలను తొలగించి, సరైన దిశానిర్దేశం చేసే శక్తి కవిత్వానికే ఉందని ప్రముఖ కవి కోడం పవన్ కుమార్ అన్నారు. సిద్దిపేటలో ‘వెన్నెల సాహితీ సంఘం’ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న అసహనం ప్రమాదకరమని, దీనిని చక్కదిద్దాల్సిన బాధ్యత కవులదేనని పేర్కొన్నారు. పాలకుల లోపాలను నిర్మొహమాటంగా ప్రశ్నించే ధైర్యం కవులకే ఉంటుందన్నారు. యాదగిరి, అశోకరాజు తదితరులు పాల్గొన్నారు.

News March 14, 2026

నెల్లూరులో పలు హోటల్స్ తనిఖీ.. 92 సిలిండర్లు సీజ్

image

జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్ల వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో వాడే సిలిండర్లను అక్రమంగా హోటల్స్‌లో వాడుతున్నట్లు గుర్తించారు. భారత్ గ్యాస్ 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.

News March 14, 2026

భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.