News January 21, 2025

KMR: నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: SP

image

నేరాల‌కు పాల్ప‌డితే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చ‌రించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన ఒక కేసులో సోమవారం ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచామన్నారు. ఒకరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష , రూ.4 వేల జరిమానా, మరొకరికి ఏడాది జైలు శిక్ష రూ.4 వేల జరిమానా విధిస్తూ.. జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు విధించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News December 21, 2025

ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

image

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎం‌హెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

News December 21, 2025

తిరుపతి: మీ వాట్సప్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.?

image

వాట్సాప్ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP సుబ్బరాయుడు తెలిపారు. హాయ్.. మీ ఫోటో చూశారా?”, “ఇది నువ్వేనా?” వంటి సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇవి ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌కు సంబంధించినవని, లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 21, 2025

బాపట్ల జిల్లాలో ఎంతమందికి పోలియో చుక్కలు వేశారంటే..!

image

బాపట్ల జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు DMHO విజయమ్మ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,45,098 మంది చిన్నారులు ఉండగా వారిలో 1,09,683 మందికి ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన పిల్లలకు సోమ, మంగళవారం వైద్య సిబ్బంది గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు సహకరించాలన్నారు.