News January 21, 2025

KMR: నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: SP

image

నేరాల‌కు పాల్ప‌డితే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చ‌రించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన ఒక కేసులో సోమవారం ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచామన్నారు. ఒకరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష , రూ.4 వేల జరిమానా, మరొకరికి ఏడాది జైలు శిక్ష రూ.4 వేల జరిమానా విధిస్తూ.. జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు విధించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News December 10, 2025

మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

image

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.

News December 10, 2025

పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

image

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News December 10, 2025

ఇండి‘గోల’: ఈ రోజు 77 విమానాలు రద్దు

image

ఇండిగో విమానాల రద్దు పరంపర పర్వం కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు(బుధవారం) 77 విమానాలు రద్దయ్యాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే 37 ఇండిగోవిమానాలు.. రావాల్సిన 40 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికులందరికీ ముందుగానే ‘విమానాల రద్దు’ సమాచారం ఇచ్చామని తెలిపారు.