News March 29, 2025

KMR: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సీఈఓ

image

రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2025

పాల్వంచ పెద్దమ్మకు సువర్ణ పుష్పార్చన

image

పాల్వంచ పెద్దమ్మ గుడిలో గురువారం ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు పెద్దమ్మ తల్లికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా పుష్పార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు పరిసర ప్రాంతాల భక్తులు, పెద్దమ్మ గుడి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

News April 17, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS

image

@కలెక్టరేట్‌లో NH భూసేకరణపై అధికారులతో కలెక్టరేట్ సమీక్ష @కోరుట్ల మాజీ కౌన్సిలర్ పై మహిళ దాడి @రాయికల్‌లో మొక్కజొన్నకు నిప్పంటించిన దుండగులు @పలు మండలాల్లో భూభారతి చట్టం పై అవగాహన సదస్సు @ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో రూ. 74,723 ఆదాయం @కథలాపూర్‌లో అగ్నిప్రమాదం.. 400 ఈత చెట్లు దగ్ధం  @ప్రభుత్వ పాఠశాలల్లో యుడైస్ వివరాల పరిశీలన.

News April 17, 2025

మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

error: Content is protected !!