News March 13, 2025

KMR: పక్వానికి రాని పంటను కొయొద్దు: DAO

image

కామారెడ్డి జిల్లాలో వరి కోతల సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం IDOCలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడారు. హార్వెస్టర్‌లు పక్వానికి రాని పంటను కొయొద్దని సూచించారు. నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో కోతకు రాని పంటను కోస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 13, 2025

10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

News November 13, 2025

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

image

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.

News November 13, 2025

లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి: VKB ఎస్పీ

image

రాజీమార్గమే రాజమార్గమని కేసులను రాజీమార్గంతో పరిష్కరించుకొని సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఈ నెల 15న నిర్వహించే లోక్అదాలత్ లో కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలని సమావేశం నిర్వహించారు. కక్షిదారులు రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు ఉండవన్నారు.