News March 28, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్‌లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.

News November 28, 2025

KMM: సర్పంచ్ ఎన్నికల్లో తొలిసారి నోటా!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ తొలిసారి ఓటర్లకు ‘నన్‌ ఆఫ్‌ ద అబౌ(నోటా)’ అవకాశాన్ని కల్పించారు. బ్యాలెట్‌ పత్రంపై అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తును కూడా ముద్రిస్తున్నారు. ఉమ్మడి KMM జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసేందుకు సిద్ధంగా లేకపోతే ఓటరు నోటాకు వేయొచ్చు.