News March 28, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ

image

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ములుగు ఓఎస్డీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌ఛార్జిగా డీఎస్పీ రవీందర్ వ్యవహరిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న అధికారులను నియమించాలని ఉద్దేశంతో శివం ఉపాధ్యాయకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్‌ను నియమించారు.

News November 21, 2025

సిద్దిపేట: ‘మారేడుమిల్లి ఘటనపై విచారణ చేయాలి’

image

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క (రాజే) సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.

News November 21, 2025

నాగర్‌కర్నూల్ నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్

image

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. బదిలీల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రంగనాథ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సంగ్రామ్ సింగ్ పాటిల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.