News March 24, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Similar News

News April 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 1, 2025

మరోసారి విఫలమైన హిట్‌మ్యాన్

image

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో 13 పరుగులకే ఆయన వెనుదిరిగారు. తొలి నుంచి ఆయన షాట్లు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సీజన్‌లో సీఎస్కేపై డకౌట్, గుజరాత్‌పై 8 పరుగులు మాత్రమే చేశారు. కేకేఆర్‌తో మ్యాచులోనూ తక్కువ స్కోరు చేసి విఫలమయ్యారు. కాగా గత ఐపీఎల్‌ సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న విషయం తెలిసిందే.

News April 1, 2025

మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ

image

మంచిర్యాలలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో రాధాకృష్ణ అనే సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన కూతురు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లాకర్‌లోని రూ.65 వేలు విలువ చేసే 20 గ్రా బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!