News April 2, 2025
KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
Similar News
News March 1, 2026
నెల్లూరు జిల్లా YCPలో ఆయన ఫేవరెట్టా.?

ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో డీలాపడ్డ YCPకి MLC చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నారు. అనిల్, కాకాణి వంటి నేతలు పార్టీకి కొంత కాలం దూరంగా ఉండటం, ఆ సమయంలో కూటమికి దీటుగా సమాధానం ఇవ్వడం, కార్యకర్తలు, నేతలకు భరోసా ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి జగన్ దృష్టిని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నుంచి ఆయన్ను బరిలో దింపనున్నట్లు చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసొస్తుందంటున్నారు.
News March 1, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL)లో 34 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 3 ఆఖరుతేదీ కాగా.. మార్చి 14వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.celindia.co.in
News March 1, 2026
శ్రీకాకుళం డయేరియా.. మరో ఇద్దరు అధికారుల సస్పెండ్

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమీషనర్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శరత్ను విధులు నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జరిచేశారు. ఎమ్హెచ్ఓ సుధీర్, ఇంచార్జ్ ఈఈ కమలాకర్తో పాటు మరికొందరకి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు. మరికొంతమంది అధికారులకు వేటుపడే అవకాశముంది.


