News April 2, 2025
KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
Similar News
News December 22, 2025
హార్మోనల్ ఇంబాలెన్స్ని ఎలా గుర్తించాలంటే?

మన శరీరంలోని హార్మోన్లు మానసిక స్థితి, శక్తి, జీవక్రియ, నిద్ర, ఆకలి, పునరుత్పత్తి ఆరోగ్యం ఇలా అన్నిటిని నియంత్రిస్తాయి. అయితే ఇవి అస్తవ్యస్తం అవ్వడం వల్ల మహిళల్లో గర్భం, PCOS, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. వీటితో పాటు నిరంతర అలసట. ఆకస్మిక బరువు పెరగడం లేదా తగ్గడం, మొటిమలు, జుట్టు రాలడం, మానసిక అనారోగ్యాలు, అధిక నిద్ర, జీర్ణ సమస్యలు, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
News December 22, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘నో అడ్మిషన్’ బోర్డు కోసం ఏం మార్చాలి?

విద్యారంగంపై పాలకులు ఎన్ని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా టీజీలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేక <<18629441>>ఖాళీ<<>> అవుతున్నాయి. మౌలిక సదుపాయాల లోపం, ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల మొగ్గు, ప్రైవేట్ స్కూళ్ల పోటీయే దీనికి కారణం. ఉపాధి కోసం వలసలు వెళ్లడం, గురుకులాల వైపు విద్యార్థులు మళ్లడంతో పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం ఏంచేయాలో కామెంట్ చేయండి.
News December 22, 2025
న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు

<


