News April 2, 2025

KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.

Similar News

News December 24, 2025

మానకొండూరు: పీజీటీ జగన్నాథంపై సస్పెన్షన్ వేటు

image

మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల PGT గోలి జగన్నాథంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. సహోద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు ఆయన ప్రవర్తనపై ఎంఈఓ, డీఈఓలకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ జరిపించిన కలెక్టర్, వేధింపులు నిజమని తేలడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.

News December 24, 2025

తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

image

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.

News December 24, 2025

KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.