News April 2, 2025

KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.

Similar News

News December 13, 2025

పొగమంచు, డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు <<18540788>>ప్రమాదానికి<<>> డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా మలుపుల వద్ద వేగంగా తిప్పడంతో నియంత్రించలేకపోయాడని తెలిపారు. నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది చనిపోయారన్నారు. అయితే ప్రమాదానికి ముందు బ్రేక్ పడట్లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ చెప్పారు.

News December 13, 2025

ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. ఏర్పాట్లపై SEC ఆరా

image

APలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పదవీకాలం ముగుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ముందస్తు కార్యక్రమాలపై SEC నీలం సాహ్ని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చితో, సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. కాగా TGలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

News December 13, 2025

ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

image

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.