News March 21, 2025
KMR: పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమలు: SP

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద BNS సెక్షన్ 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా SP రాజేష్ చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల 200 మీటర్ల వరకు గుంపులుగా ఉండరాదన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ను వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News April 22, 2025
నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News April 22, 2025
నా జిల్లా మొదటి స్థానం: మంత్రి సీతక్క

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో తన సొంత జిల్లా ములుగు మొదటి స్థానం, తాను ఇన్చార్జిగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన గిరిజన ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్, డీఈఓలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు
News April 22, 2025
INTER RESULTS.. ఖమ్మంలో బాలికలదే హవా.!

ఇంటర్ ఫలితాల్లో.. ఖమ్మం జిల్లాలో అమ్మాయిలు ప్రతిభ చాటారు. ఫస్టియర్లో 17,837 మందికి 12,476 మంది విద్యార్థులు హాజరు కాగా, జనరల్లో బాలురు 64.51, బాలికలు 77.89 శాతం, ఒకేషనల్లో బాలురు 43.95, బాలికలు 76.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 16,919 మందికి 12,996 మంది హాజరు కాగా, జనరల్లో బాలురు 72.10, బాలికలు 83.13 శాతం, ఒకేషనల్లో బాలురు 52.60, బాలికలు 86.90 శాతం ఉత్తీర్ణత సాధించారు.