News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.
Similar News
News April 23, 2025
బిక్కనూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ర్ట సహకార అధికారి

బిక్కనూర్ మండలం బస్వాపూర్తో పాటు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రాష్ట్ర సహకార అధికారి ఫణీంద్రరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో వారికి మంచినీటి వసతి, టెంటు సౌకర్యం కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్ ఉన్నారు.
News April 23, 2025
పాకిస్థాన్కు భారత్ దెబ్బ?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.
News April 23, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ క్లాస్లో ఎంతమంది పాసయ్యారంటే

ఎన్టీఆర్ జిల్లాలో టెన్త్ పరీక్షలు 27,467 మంది విద్యార్థులు రాయగా 23,534 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 19,589 మంది ఫస్ట్ డివిజన్లో, 2,782 మంది సెకండ్ డివిజన్లో, 1,163 మంది థర్డ్ డివిజన్లో పాసయ్యారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా.KV శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.