News March 11, 2025

KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు

image

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరం వేదికగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూముల సమస్యలు, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు, రైతుభరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్యం తదితర అంశాలపై 101 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 24, 2026

‘టెర్రర్’ ఆరోపణలు.. టెలిగ్రామ్ ఫౌండర్‌పై రష్యా దర్యాప్తు

image

టెర్రరిజం యాక్టివిటీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో టెలిగ్రామ్ ఫౌండర్‌ పావెల్ దురోవ్‌పై రష్యా దర్యాప్తు ప్రారంభించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ పత్రిక Rossiyskaya Gazeta తెలిపింది. వెస్టర్న్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌తో యాప్ రాజీపడినట్లు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ రిపోర్టు ఇచ్చిందని పేర్కొంది. రూల్స్ ఉల్లంఘిస్తున్న టెలిగ్రామ్‌ను స్లోడౌన్ చేస్తామని ఇటీవల రష్యా హెచ్చరించింది.

News February 24, 2026

KKD: 19,593 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్!

image

KKD జిల్లాలో PM సూర్య ఘర్ పథకం కింద SC, ST వర్గాల గృహాలపై సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. మంగళవారం KKD కలెక్టరేట్ నుంచి APEPDCL అధికారులు, వెండార్లతో దీనిపై సమీక్షించారు. జిల్లాలో 19,593 మంది SC, STల గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన ప్యానెల్స్ అమర్చాలని అధికారులకు సూచించారు.

News February 24, 2026

బ్రహ్మోత్సవాలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ఠంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో బ్రహ్మోత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.