News March 21, 2025

KMR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం జనరల్ గ్రూప్ కు సంభందించి 6928 మంది పరీక్ష రాయాల్సి ఉండగా..148 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 1042 మంది మాత్రమే పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. పరీక్షలు పూర్తి అవ్వడంతో విద్యార్థులు తమ ఇంటికి బయలుదేరారు.

Similar News

News November 27, 2025

వరంగల్: పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

image

సెప్టెంబర్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌తోపాటు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులను రాజీమార్గంలో ముగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు అభినందించారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.

News November 27, 2025

టీమ్‌ ఇండియా సెలక్షన్‌పై CV ఆనంద్ అసంతృప్తి

image

భారత క్రికెట్‌ పరిస్థితిపై TG హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భారత్‌లో ప్రత్యర్థులు గెలవడం అరుదుగా జరిగేదని.. ప్రస్తుతం భారత ప్లేయర్లు స్వదేశంలోనే స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రంజీలు ఆడకపోవడం, IPL ఆధారంగా సెలక్షన్ జరగడం దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రంజీ‌లో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనబెట్టడం సెలక్షన్‌లో పక్షపాతానికి నిదర్శనమన్నారు.

News November 27, 2025

మంచిర్యాల: రైతుల ఖాతాలలో నగదు జమ

image

జిల్లాలో 2025-26సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇటిక్యాలలో మెప్మా, గుల్లకోట కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ అయిందన్నారు.