News April 14, 2025

KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

నవజాత శిశువుల్లో మూర్ఛ లక్షణాలు

image

చిన్నారి కదలికలు ఆకస్మికంగా ఆగిపోవడం, చూపులు కొద్దిగా ప్రక్కకు ఉండటం, చేతులు, కాళ్ళు ఆపకుండా లయ పద్ధతిలో కదిలించడం, మోచేతులను చాలాసేపు వంచి, పొడిగించి గట్టిగా ఉంచినట్లు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శిశువుల్లో మూర్ఛ రావడానికి ప్లాసెంటల్ అబ్రక్షన్, సుదీర్ఘ ప్రసవం, ప్రసవానికి ముందు లేదా ఆ తరువాత సమయంలో ఆక్సిజన్ లేకపోవడం, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

News November 22, 2025

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: కామారెడ్డి డీఈవో

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జిల్లా క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14,17 క్రీడా పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

News November 22, 2025

చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

image

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్‌ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్‌ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.