News April 14, 2025

KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

image

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

News September 17, 2025

RGM: సింగరేణి S & PCఅధికారులతో సమావేశం

image

RGM సింగరేణి సంస్థ GM ఆఫీస్ లో RG-1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల S&PC డిపార్ట్మెంట్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GM సెక్యూరిటీ లక్ష్మీనారాయణ, GM లలిత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో వినియోగాన్ని తగ్గించాలన్నారు. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు వీరారెడ్డి, షరీఫ్, షబీరుద్దీన్ ఉన్నారు.

News September 17, 2025

Way2News కథనానికి స్పందన.. బంధువుల వద్దకు చేరిన బామ్మ

image

బాపట్లలో Way2News కథనానికి కొన్ని నిమిషాల్లోనే స్పందన లభించింది. ఓ వృద్ధురాలిని బైక్‌పై తీసుకొచ్చి నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిన ఘటన మంగళవారం బాపట్లలో వెలుగు చూసింది. బైక్‌పై తీసుకొచ్చి.. బజారులో వదిలేశారు శీర్షికన Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.