News April 14, 2025

KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News February 26, 2026

TG ప్రభుత్వానికి విద్యాకమిషన్ ప్రతిపాదనలు

image

* బోధనా మాధ్యమంగా ఇంగ్లిష్. త్రిభాషా విధానం(తెలుగు/ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ) ఒకటో తరగతి నుంచే అమలు.
* SSC, ఇంట‌ర్ బోర్డులు విలీనం చేసి, 12వ త‌ర‌గ‌తిలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వ‌హించాలి. కనీస ఉత్తీర్ణ‌త శాతాన్ని 45కు పెంచాలి.
* EAPCET ర‌ద్దు చేసి ఇంజినీరింగ్‌, వ్య‌వ‌సాయం, ఫార్మ‌సీ ప్ర‌వేశాలు 12వ త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా కేటాయించాలి.
* IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నియంత్రణకు చట్ట సవరణ చేయాలి.

News February 26, 2026

నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

News February 26, 2026

SVU: ప్రొఫెసర్‌కు ప్రఖ్యాత అవార్డు

image

SVU వైరాలజీ విభాగ ఆచార్యులు, డీన్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ జి. నరసింహకు న్యూఢిల్లీలోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (NESA) అవార్డు–2025ను ప్రదానం చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. NESA ఫెలోషిప్ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధన, ఆవిష్కరణ శాస్త్రీయ విభాగాలలో పురోగతికి చేసిన అత్యుత్తమ కృషికి ఇస్తారు. నరసింహ ఆధునిక వైద్యంలో నానోటెక్నాలజీ అనువర్తనాలు చేశారు.