News April 14, 2025
KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
ANU: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఆగస్టు నెలలో జరిగిన ఎం ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్ సప్లమెంటరీ ఫలితాలలో 83.78%, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలలో 84.77% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కొరకు ఈనెల 15వ తేదీ లోపు రూ.2,190 నగదు చెల్లించాలన్నారు.
News December 5, 2025
రణస్థలం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.
News December 5, 2025
7న తిరుపతి జిల్లాలో NMMS పరీక్ష

తిరుపతి జిల్లాలో ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) పోటీ పరీక్ష జరగనుంది. గూడూరులో 3, పుత్తూరులో 2, శ్రీకాళహస్తిలో 3, సూళ్లూరుపేటలో 2, తిరుచానూరులో 2, తిరుపతిలో 2 మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2,958 మంది పరీక్షకు హాజరవుతారని డీఈవో కుమార్ తెలిపారు. అర గంట ముందే ఎగ్జాం సెంటర్లకు వెళ్లాలని సూచించారు.


