News January 29, 2025
KMR: ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: కలెక్టర్

ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News November 25, 2025
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పెగడపల్లిలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వడ్డీలేని రుణాల పంపిణీ గురించి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. పలువురు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులున్నారు.
News November 25, 2025
GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.
News November 25, 2025
వరంగల్: అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే..?

WGL(D) సంగెం(M) ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒక్క SCగా 60ఏళ్ల కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే జాక్పాట్. మొత్తం 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో ఇప్పుడు మల్లమ్మ ప్రజెంట్ ఫేవరెట్గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా ఆమెను సంప్రదిస్తున్నాయట. ప్రేమవివాహం చేసుకున్న BC-SC దంపతులపైనా పార్టీల దృష్టి పడినట్లు సమాచారం.


