News January 29, 2025

KMR: ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: కలెక్టర్

image

ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Similar News

News October 17, 2025

ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

image

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.

News October 17, 2025

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ నర్సింహా

image

నూతనంగా నిర్మిస్తున్న అనంతగిరి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నర్సింహా శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

News October 17, 2025

మక్తల్: మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనుల శంకుస్థాపనను మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు రూ.3.70 లక్షల నిధులతో సీడీఎంఏ ప్రత్యేక నిధుల కింద ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టపై మొక్కలు నాటారు. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.