News January 31, 2025
KMR: ఫుడ్ పాయిజన్ అవాస్తవం: సబ్ కలెక్టర్

బీర్కూరు మండలం రైతునగర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న కథనాలపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందించారు. తక్షణమే సంబంధిత అధికారులతో విచారణకు ఆదేశించానన్నారు. ఆ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్కు గురి కాలేదని ఆమె స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె ‘Way2 news’ తో పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి వివిధ వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను పిలిపించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అర్జీలకు తక్షణ స్పందనతో వ్యవహరించడం ప్రజల్లో సంతృప్తిని కలిగించింది.
News November 10, 2025
మాచర్ల: పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. ప్రభుత్వ సూచనల కోసం సమయం కావాలని న్యాయవాది లూథ్రా అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణలో ఉన్న పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం


