News April 8, 2025

KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

image

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.

Similar News

News November 28, 2025

పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

News November 28, 2025

పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

News November 28, 2025

ఖమ్మం-అశ్వారావుపేట రోడ్డు రెన్యువల్‌కు మంత్రి తుమ్మల లేఖ

image

ఖమ్మం-అశ్వారావుపేట జాతీయ రహదారిని అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్‌మెంట్ చేయాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న గుంతల రోడ్డు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ఈ రహదారి కాకినాడ, వైజాగ్ పోర్టులకు కీలకం కాబట్టి, 4 లేన్ల విస్తరణకు సమయం పడుతున్నందున, తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు.