News January 30, 2025
KMR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ బలపరిచిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులైన మల్క కొమరయ్య, సి.అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు
Similar News
News January 7, 2026
కామారెడ్డి: మున్సిపాలిటీలలో ఓటర్ జాబితాను సవరించాలి: బీజేపీ

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని వెంటనే ఓటర్ జాబితాను సవరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు కోరారు. కలెక్టరేట్లో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఓటర్ జాబితాను సవరించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గుప్తా, విపుల్ జైన్ పాల్గొన్నారు.
News January 7, 2026
దావోస్లో ఫోర్త్ సిటీపై సీఎం ప్రజెంటేషన్

TG: దావోస్ పర్యటనలో CM రేవంత్ రెడ్డి ‘World Economic Forum’ సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారబోతున్నHYD ‘ఫోర్త్ సిటీ’ గురించి ప్రత్యేకంగా వివరించనున్నారు. తెలంగాణ రైజింగ్పై సమగ్ర నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జనవరి 19-23 వరకు ప్రపంచ ఆర్థిక వేదికలో TG పెవిలియన్లో ఫోర్త్ సిటీ నమూనాను ప్రదర్శించనున్నారు.
News January 7, 2026
GNT: ధరల పతనానికి బ్రేక్.. మిర్చి మార్కెట్లో ప్రభుత్వం ఫుల్ కంట్రోల్

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.


