News January 30, 2025
KMR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ బలపరిచిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులైన మల్క కొమరయ్య, సి.అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు
Similar News
News October 27, 2025
BWF-2025 తదుపరి టోర్నీలకు పీవీ సింధు దూరం

ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత PV సింధు ‘BWF TOUR-2025’ తదుపరి ఈవెంట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ లీగ్కు ముందు పాదానికి తగిలిన గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాయం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాలిక ఫిట్నెస్, ఆట మెరుగుపడటానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. 2026 JANలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
News October 27, 2025
నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.
News October 27, 2025
తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.


