News March 29, 2025
KMR: బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

HYD స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో BC విద్యార్థులకు నెల పాటు నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని బి.స్రవంతి శుక్రవారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రైవేటు బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసి 26 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులని ఆమె తెలిపారు.
Similar News
News April 23, 2025
PSR ఆంజనేయులుకు రిమాండ్

AP: ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులుకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు మే 7 వరకు రిమాండ్ విధించింది. ముంబై నటి జెత్వానీ కేసులో నిన్న సీఐడీ పోలీసులు ఆయనను HYDలో అరెస్టు చేశారు. ఆమెపై అక్రమ కేసు బనాయించిన కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈయన జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు.
News April 23, 2025
ఉగ్రదాడి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ఘటనలో మొత్తం 28 మంది చనిపోగా, అందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.
News April 23, 2025
10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.