News April 3, 2024
KMR: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన దోమకొండలో జరిగింది. మండలానికి చెందిన వంశీ(24) కొన్నిరోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యి సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు SI గణేశ్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
NZB: నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 6, 2026
ఓటర్ జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: NZB కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాబితా రూపొందించాలన్నారు.
News January 6, 2026
జక్రాన్పల్లి: ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.


