News April 16, 2025
KMR: భూ భారతి అవగాహన సదస్సులు ప్రారంభం

భూ భారతి కార్యక్రమంపై నేటి నుంచి ఈ నెల 30 వరకు మండలాల వారీగా భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. రైతు వేదికలు, ఫంక్షన్ హాల్స్లో సదస్సులు జరగనున్నాయి. ప్రతి మండలంలో 200 మందికి తక్కువ కాకుండా రైతులు పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని తెలిపారు. సమయ పట్టిక ప్రకారం వివిధ మండలాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో సమావేశాలు జరగుతాయన్నారు.
Similar News
News November 19, 2025
కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
News November 19, 2025
మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News November 19, 2025
వరంగల్: సూరీడూ.. జల్దీ రావయ్యా..!

ఉమ్మడి వరంగల్లో చలి పెరిగిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు హాస్టళ్లు ఊరి చివర్లో ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ఉదయమే ఎండ కోసం తపిస్తున్నారు. సూర్యుడు రాగానే విద్యార్థులంతా బయటకు వచ్చి ఎండలో నిలబడుతున్నారు. దీంతో ఎండతో పాటు విటమిన్-డి సైతం లభిస్తుంది. పర్వతగిరిలోని KGBV హాస్టల్ విద్యార్థులు ఉదయం వేళలో ఇలా ఎండలో నిలబడుతున్నారు.


