News April 16, 2025
KMR: భూ భారతి అవగాహన సదస్సులు ప్రారంభం

భూ భారతి కార్యక్రమంపై నేటి నుంచి ఈ నెల 30 వరకు మండలాల వారీగా భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. రైతు వేదికలు, ఫంక్షన్ హాల్స్లో సదస్సులు జరగనున్నాయి. ప్రతి మండలంలో 200 మందికి తక్కువ కాకుండా రైతులు పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని తెలిపారు. సమయ పట్టిక ప్రకారం వివిధ మండలాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో సమావేశాలు జరగుతాయన్నారు.
Similar News
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.
News December 4, 2025
HYD: DEC 16న అథ్లెటిక్స్ MEET

డిసెంబర్ 16న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉ. 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4- 20 ఏళ్లలోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు https://forms.gle/ouD9qXh9QTyAY7R47 రిజిస్టర్ చేసుకోవాలని. మిగతా వివరాలకు 99630 48320, 99590 91114లలో సంప్రదించండి.
News December 4, 2025
అన్నమయ్య: రైలు పట్టాలపై యువకుల మృతి

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. సెంట్రల్ ట్రాక్పై కూర్చొని మద్యం తాగుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో చనిపోయారని సమాచారం.


