News February 4, 2025
KMR: ‘మత్స్యకారులందరరూ వివరాలను నమోదు చేసుకోవాలి’

కామారెడ్డి జిల్లాలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న మత్స్యకారులందరూ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన కింద CSC సెంటర్ లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత సమాచారంతో తమ కామన్ సర్వీస్ కేంద్రాలను సంప్రదించాలన్నారు.
Similar News
News November 28, 2025
గిరిరాజ్ కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి

జి.జి.కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కులవివక్షతను ఎదిరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, స్త్రీవిద్య కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఫూలే స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం పేర్కొన్నారు. దండుస్వామి, రామస్వామి, రంజిత, నహీదా బేగం, వినయ్ కుమార్, పూర్ణచందర్ రావు, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 28, 2025
మోడల్ ఫామ్ డెమో హౌస్ను సందర్శించిన కలెక్టర్

బూర్గంపాడు మండలంలోని ఎంపీ బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ ఫామ్ డెమో హౌస్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ ఆధారిత బహుముఖ ఆదాయ వనరులను గ్రామస్థులకు చేరువ చేయడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన ఈ మోడల్ ఫామ్ జిల్లా స్థాయిలో ఆదర్శ ప్రదర్శనగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు.
News November 28, 2025
శ్రీశైలంలో డిసెంబర్-1 నుంచి ఉచిత లడ్డూ కౌంటర్.!

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభించటంతోపాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.


