News April 15, 2025
KMR: మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి

కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన నాగరాజు(35) మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నాగరాజు అతని బామ్మర్ది రాజుతో కలిసి భవానిపేటకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి మద్యం తాగారు. తిరిగి వెళ్తుండగా నాగరాజు కింద పడ్డాడు. గాయాలు కావడంతో HYDలో హాస్పిటల్లో చికత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
JGTL: SM పుణ్యం.. 10నెలల తర్వాత దొరికాడు..!

మెట్పల్లి మం. జగ్గాసాగర్కి చెందిన పూసల నరేందర్(40) గతేడాది DECలో సోదరి కుమార్తె వివాహనికి HYDకు వెళ్లి తప్పిపోయాడు. కాగా, దాదాపు 10నెలల తరువాత అతడి ఆచూకీ లభ్యమయింది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు నరేందర్ను అతడి భార్యకు సోమవారం అప్పజెప్పారు. అయితే మానసిక స్థితి సరిగ్గాలేని నరేందర్ ఇంతకాలం మంచాల మానవ సేవా అనాథాశ్రమంలో ఆశ్రయం పొందాడు. కాగా, ఆశ్రమ నిర్వాహకులు నరేందర్ గురించి SMలో పోస్ట్ చేశారు.
News October 14, 2025
జగిత్యాల: ప్యాడీ కొనుగోళ్ల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్

ఖరీఫ్ 2025- 26 ప్యాడీ కొనుగోళ్ల ఏర్పాట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం జగిత్యాల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో PPCల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లు, మిల్లర్ల ట్యాగింగ్, స్పెషల్ ఆఫీసర్ల నియామకం, సీఎంఆర్ డెలివరీలు, ఇతర కొనుగోళ్ల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ BS లత ఉన్నారు.
News October 14, 2025
వంటింటి చిట్కాలు

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.
<<-se>>#VantintiChitkalu<<>>