News April 15, 2025
KMR: మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి

కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన నాగరాజు(35) మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నాగరాజు అతని బామ్మర్ది రాజుతో కలిసి భవానిపేటకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి మద్యం తాగారు. తిరిగి వెళ్తుండగా నాగరాజు కింద పడ్డాడు. గాయాలు కావడంతో HYDలో హాస్పిటల్లో చికత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 23, 2026
మొలతాడు గురించి మీకు ఈ కథ తెలుసా?

మొలతాడుధారణ వెనుక ఓ పురాణ కథ ఉంది. కృష్ణుడి వరంతో ఉదంక మహర్షికి అమృతం ఇవ్వడానికి ఇంద్రుడు చండాలుడి రూపంలో వచ్చాడు. అమృత భాండాన్ని తన నాభి దిగువన మొలతాడుకు కట్టుకుని తెచ్చాడు. నాభి కింద భాగం అపవిత్రమని భావించిన రుషి దానిని నిరాకరించాడు. ఈ ఘటన ద్వారా శరీరాన్ని ఊర్థ్వ, అథో భాగాలుగా విభజించే సూచీ రేఖగా మొలతాడు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది క్రమశిక్షణకు, పవిత్రతకు చిహ్నంగా మారింది.
News February 23, 2026
APPLY NOW: ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News February 23, 2026
సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కొట్టివేత

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన <<19208192>>ఏకసభ్య కమిషన్ను<<>> సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పరిపాలనా పరమైన లోపాల గుర్తింపునకు ఆ కమిషన్ను ఏర్పాటు చేశారని CJI ధర్మాసనం అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేయబోదని పేర్కొంది.


