News April 15, 2025

KMR: మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి

image

కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన నాగరాజు(35) మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నాగరాజు అతని బామ్మర్ది రాజుతో కలిసి భవానిపేటకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి మద్యం తాగారు. తిరిగి వెళ్తుండగా నాగరాజు కింద పడ్డాడు. గాయాలు కావడంతో HYDలో హాస్పిటల్లో చికత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

image

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.

News November 17, 2025

డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

image

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.

News November 17, 2025

నరసరావుపేట: ఎస్పీ కార్యాలయంలో 111 ఫిర్యాదులు

image

నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో SP కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన మొత్తం 111 అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ SP సంతోష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.