News February 27, 2025

KMR: మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ శాతం ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా టీచర్ల, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరో వైపు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 వరకు జిల్లాలో పట్టభద్రులు 47.43%, 64.74% శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News December 9, 2025

పాలమూరు: ఎన్నికల మేనిఫెస్టో.. ఆడపిల్ల పుడితే రూ.5,116

image

నర్వ మండలం రాయికోడ్ స్వాతంత్ర అభ్యర్థి సూరం చంద్రకళ, కృష్ణయ్య GP మేనిఫెస్టోను విడుదల చేశారు.
➤ ప్రతి ఆడపిల్ల పెళ్లికి ‘గ్రామ కళ్యాణం’ కింద రూ.2,116
➤అమ్మ వందనం’ పేరుతో ఆడపిల్ల పుడితే రూ. 5,116, మగబిడ్డ పుడితే రూ.2,116
➤ ఆకస్మిక ప్రమాదం జరిగితే తక్షణ సాయం కింద రూ.20,116 అందజేత
➤పదిలో ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థికి రూ.10,116 నగదు బహుమతి
➤భౌతిక కాయం భద్రత కోసం ఫ్రీజర్ ఏర్పాటు.

News December 9, 2025

ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

image

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

News December 9, 2025

శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారా?

image

శ్రీశైలం సముద్ర మట్టానికి 1,500Ft ఎత్తులో, 2,830Ft శిఖరం కలిగిన పవిత్ర క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి పూజామందిరంగా, రాముడు, పాండవులు దర్శించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1,326-35లో దీనికి మెట్లు నిర్మించారు. ఎంతో కష్టపడొచ్చి దూళి దర్శనం చేసుకున్న భక్తులు పాతాళ గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి దైవానుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు.