News February 27, 2025

KMR: మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ శాతం ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా టీచర్ల, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరో వైపు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 వరకు జిల్లాలో పట్టభద్రులు 47.43%, 64.74% శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్‌‌‌ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.

News November 12, 2025

KNR: ఆర్టీఏలో ‘సీక్రెట్ కోడ్’ వసూళ్లు..!

image

KNR RTA కార్యాలయం దళారులకు దాసోహమంటోంది. అధికారులు, దళారులు సీక్రెట్ కోడ్ ఏర్పాటుచేసుకుని అక్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలోస్తున్నాయి. వాహనదారులు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన డాక్యుమెంట్స్‌పై కోడ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయట. ఉమ్మడిజిల్లాలో ప్రతిరోజు 450వరకు స్లాట్స్ బుక్ అవుతుండగా ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ బదిలీలను ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. సాయంత్రం 6 దాటాక డబ్బుల పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం.

News November 12, 2025

జూబ్లీహిల్స్‌‌‌ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.