News February 26, 2025

KMR: మహా శివ రాత్రి.. శివాలయాలపై ప్రత్యేక కథనం..

image

శివరాత్రి నేపథ్యంలో KMR జిల్లాలోని ఆయా శివాలయాల పై ప్రత్యేక కథనం..దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆది బసవేశ్వర స్వయంభు ఆలయం బొర్లంలో ఉంది. గుడిలోని ఆది బసవేశ్వరుడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ ఉండడం విశేషం. 1500 ఏళ్ల క్రితం నిర్మించిన సోమలింగేశ్వర ఆలయం దుర్కిలో ఉంది. భక్తుల కోరికలు తీర్చే లింగేశ్వరుడిగా ఈ ఆలయం పేరు గాంచింది. మరి మీ గ్రామాల్లో ఉన్న ఆలయాల ప్రత్యేకత గురించి కామెంట్‌లో తెలుపండి.

Similar News

News November 21, 2025

HYD: నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

image

హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6 నమోదు కాగా, సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది.

News November 21, 2025

కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

image

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

News November 21, 2025

అక్టోబర్‌లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

image

TG: అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.